ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆర్మీ స్పష్టం
By: chandrasekar Tue, 08 Sept 2020 3:43 PM
సైనిక బలగాల ఉపసంహరణకు, ఎల్ఏసీ
వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆర్మీ స్పష్టం చేసింది.
పాంగాంగ్ సో సరస్సు సమీపంలో భారత బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయన్న చైనా సైన్యం
ఆరోపణలు భారత్ ఖండించింది. ఈ విషయమై ఇండియన్ ఆర్మీ ఈ ప్రకటన చేసింది.
మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండి పడింది. ఇండియన్ ఆర్మీ
ఎల్ఎసీ వెంబడి ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడలేదని ఫైరింగ్ సహా రెచ్చగొట్టే చర్యలకు
దిగలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
‘‘సోమవారం నాటి ఘటన విషయానికి వస్తే.. చైనా బలగాలు
ఎల్ఏసీ వెంబడి మా ఫార్వార్డ్ పొజిషన్ సమీపంలోకి రావడానికి ప్రయత్నించాయి. దీన్ని
అడ్డుకోవాదానికి చైనా బలగాలను
భయపెట్టడానికి గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. సైనిక, దౌత్యపరమైన, రాజకీయ
చర్చలు జరుగుతుండగానే పీఎల్ఏ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా దుందుడుకుగా
వ్యవహరిస్తోంది’’ అని భారత సైన్యం ప్రకటనలో తెలిపింది. పాంగాంగ్ సో సరస్సు సమీపంలో
సోమవారం రాత్రి భారత బలగాలు చైనా సరిహద్దు దాటి వచ్చాయని, అడ్డుకోబోయిన
తమ సైనికులపై కాల్పులు జరిపాయని చైనా ఆర్మీ ఆరోపించింది. దీంతో తప్పనిసరి
పరిస్థితుల్లో తాము కూడా కాల్పులు జరిపామని చెప్పింది.