కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
By: chandrasekar Thu, 09 July 2020 5:27 PM
తెలంగాణలో కరోనా రోగుల
నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బు గుంజుతున్నాయన్న ఆరోపణలు
వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక
నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా వైరస్ వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ
ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే
ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ
చేశారు. అందులో భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ
పరిధిలోకి చేర్చింది.
వసూలు చేయాల్సిన ఫీజుల:
ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి
వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980
నాన్ క్రిటికల్ కరోనా
పేషేంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250
క్రిటికల్ కరోనా
పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ. 5,480
వెంటిలేటర్ పెట్టి
వైద్యం అందిస్తే రోజుకి రూ. 9,580
ఇన్ఫెక్షన్ ఉన్న వారికి
వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280
ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్
పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380
ఏపీ ఆరోగ్య శ్రీ నెట్వర్క్
పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ
చేసింది.