Advertisement

  • భారత త్రివిధదళాల సారథ్యంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్‌ను పరీక్షలు...

భారత త్రివిధదళాల సారథ్యంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్‌ను పరీక్షలు...

By: chandrasekar Tue, 17 Nov 2020 5:13 PM

భారత త్రివిధదళాల సారథ్యంలో బ్రహ్మోస్ సూపర్  సోనిక్‌ను పరీక్షలు...


భారత్​ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశాలకు చాటి చెప్పాలని అనుకుంటోంది. త్రివిధ దళాలతో హిందూ మహాసముద్రంలో బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్​ క్షిపణిని పరీక్షించేందుకు తయారవుతోంది. నవంబర్​ చివర్లో పలుమార్లు అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణి వ్యవస్థను పరీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం చైనా, పాకిస్థాన్​తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్​. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని చేపట్టనుంది.

ఈ ప్రయోగాలు నవంబర్​ నెల చివరి వారంలో జరుగుతాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని తెలిపాయి. డీఆర్​డీఓ కొత్తగా అభివృద్ధి చేసిన వాటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్షిపణి వ్యవస్థలను గత రెండు నెలల్లో విజయవంతంగా పరీక్షించింది. 800కి.మీ సుదూర లక్ష్యాలను ఛేదించగల శౌర్య క్షిపణి వ్యవస్థను కూడా పరీక్షించింది. సుకోయ్-30 యుద్ధ విమానం, బ్రహ్మోస్ సూపర్​సోనిక్​ క్షిపణిలను బంగాళాఖాతంలో ప్రయోగించి సఫలీకృతమైంది. గల్వాన్​ లోయ ఘటన అనంతరం చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థతో యుద్ధవిమానాలను సైన్యం ఇప్పటికే మోహరించింది​. గత నెలలో భారత నావికా దళం ఐఎన్​ఎస్​ చెన్నై యుద్ధనౌక నుంచి ఈ క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించింది.

Tags :

Advertisement