భారత త్రివిధదళాల సారథ్యంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ను పరీక్షలు...
By: chandrasekar Tue, 17 Nov 2020 5:13 PM
భారత్ సరిహద్దులో
ఉద్రిక్తతల నేపథ్యంలో తన శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశాలకు చాటి చెప్పాలని
అనుకుంటోంది. త్రివిధ దళాలతో హిందూ మహాసముద్రంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్
క్షిపణిని పరీక్షించేందుకు తయారవుతోంది. నవంబర్ చివర్లో పలుమార్లు అత్యంత
శక్తిమంతమైన ఈ క్షిపణి వ్యవస్థను పరీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు
పేర్కొన్నాయి. ప్రస్తుతం చైనా, పాకిస్థాన్తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన
సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్. ఇందులో భాగంగానే హిందూ
మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు
పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని
చేపట్టనుంది.
ఈ ప్రయోగాలు నవంబర్ నెల
చివరి వారంలో జరుగుతాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా బ్రహ్మోస్
సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని
తెలిపాయి. డీఆర్డీఓ కొత్తగా అభివృద్ధి
చేసిన వాటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్షిపణి వ్యవస్థలను గత రెండు
నెలల్లో విజయవంతంగా పరీక్షించింది. 800కి.మీ సుదూర లక్ష్యాలను ఛేదించగల శౌర్య క్షిపణి
వ్యవస్థను కూడా పరీక్షించింది. సుకోయ్-30 యుద్ధ విమానం, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిలను బంగాళాఖాతంలో
ప్రయోగించి సఫలీకృతమైంది. గల్వాన్ లోయ ఘటన అనంతరం చైనాతో ఉద్రిక్త పరిస్థితుల
నేపథ్యంలో సరిహద్దులో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థతో యుద్ధవిమానాలను సైన్యం ఇప్పటికే
మోహరించింది. గత నెలలో భారత నావికా దళం
ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ఈ క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించింది.