జమ్మూకాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు....
By: chandrasekar Tue, 06 Oct 2020 1:22 PM
జమ్మూకాశ్మీర్లో
సీఆర్పీఎఫ్కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పాంపోర్ బైపాస్
వద్ద సీఆర్పీఎఫ్కు చెందిన రోడ్ ఓపింగ్ పార్టీ
పై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి.
వారిని జిల్లా హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ సైనికుల్లో ఇద్దరు మృతి చెందారు.
దీంతో భద్రతా బలగాలు ఆ
ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదుల
కోసం తనిఖీలు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం
కాశ్మీర్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా సోమవారం
శ్రీనగర్లోని పాంపోర్ బైపాస్ వద్ద బెటాలియన్కు చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ పై
మధ్యాహ్నం 12.50గంటల ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు జమ్మూ కాశ్మీర్
పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు ఓపెనింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న సమయంలో
ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాడుల్లో ఐదుగురు సిబ్బంది గాయపడగా వారి హాస్పిటల్కు తరలించగా ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.