ఘోర రోడ్డు ప్రమాదం...
By: chandrasekar Fri, 02 Oct 2020 02:34 AM
మెదక్ జిల్లాలోని
కొల్చారం మండలంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి
మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా
ఢీకొట్టడ౦తో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు తీవ్ర౦గా గాయపడ్డారు.
కాగా ప్రమాద సమయంలో ఆటోలో
9 మంది
ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోయినవారిలో మండలంలోని కిష్టాపూర్కు చెందిన చాకలి
శ్రీవర్శిని(2), వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల నిర్మల(46), అప్పాజీపల్లి
గ్రామానికి చెందిన అతినగరం సుమలత(25)
అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
కిష్టాపూర్ కు చెందిన
తల్లీ కుమారుడు చాకలి ఇందిర, చాకలి వర్షిత్, వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల స్వామి
తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా
ప్రమాదం జరిగిన చోటు అంతా చీకటిగా ఉండడంతో కాస్త ఇబ్బంది కలిగింది.
కానీ, స్థానికుల
సెల్ఫోన్ల లైట్ల ఆధారంగా గాయపడ్డవారిని పోలీసులు మొదట మెదక్ ఏరియా ఆసుపత్రికి
తరలించినా పరిస్థితి విషమించడంతో వారిని హైదరాబాద్కు తరలించారు. కారు అతివేగ౦గా
పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.