ఘోర రోడ్డు ప్రమాదం....
By: chandrasekar Wed, 16 Dec 2020 9:29 PM
పెనుబల్లి మండలంలో
తుమ్మలపల్లి విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై కారు బోల్తాపడింది. దీనితో
ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఇవాళ
తెల్లవారుజామున విజయవాడ నుంచి ఒడిశా వెళ్తున్న కారు తుమ్మలపల్లి వద్ద
బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించగా, మరో
ఐదుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మృతులను ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందినవారిగా
గుర్తించారు. వీరంతా వ్యాపారం నిమిత్తం విజయవాడ వైపు నుంచి ఒడిశాకు వెళ్తుండగా
ప్రమాదం జరిగిందని తెలిపారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం
సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.