ఘోర రోడ్డు ప్రమాదం...
By: chandrasekar Tue, 15 Dec 2020 10:26 PM
కర్నూలు జిల్లాలో లారీ
ఢీకొని నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల
ప్రకారం శిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల వద్ద 40 మంది రోడ్డు దాటుతుండగా ఐషర్ లారీ వారిని ఢీకొంది.
అయితే వీరిని ఢీకొన్న
అనంతరం కనీసం వాహనాన్ని ఆపకుండా లారీ డ్రైవర్ పారిపోయే యత్నం చేశాడు. దీంతో
స్థానికులు వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద లారీ డ్రైవర్ను
పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
ఈ రోడ్డు ప్రమాదంలో
నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 8 మంది గాయపడగా, చికిత్స నిమిత్తం సమీపంలోని నంద్యాల ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. మృతులను సురేఖ, ఝాన్సీ, వంశీ, హర్షవర్దన్లుగా గుర్తించారు.
Tags :
terrible |
road |
accident |
died |