తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల కోసం ఉద్రిక్తత...
By: chandrasekar Sat, 31 Oct 2020 5:10 PM
తిరుపతిలో ఉద్రిక్తత
పరిష్టితి నెలకొంది. తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా
తరలివచ్చారు. సర్వదర్శనం ప్రారంభించిన గంటలోనే 5 వేల టికెట్ల కోటా
పూర్తికాగా ఇంకా భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో దర్శన టికెట్లు కోసం భక్తులు
నిరసనకు దిగారు.
ఎలాంటి సమాచారం లేకుండా
టోకెన్లు జారీ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 5 గంటల
నుంచే ఇవ్వాల్సిన టోకెన్లను నిన్న రాత్రి 10 గంటలకు ఇచ్చారని చెబుతున్నారు.
భక్తుల నిరసన గురించి
తెలియగానే టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు
వెళ్లారు. ఆయన్ను భక్తులు అడ్డుకున్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న
వారికి టోకెన్లు జారీ చేయాలని ధర్మారెడ్డి ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ
ఉచిత దర్శనం టోకెన్లను కొనసాగించడం కష్టమవుతోందని ఈవో, చైర్మన్లతో
మాట్లాడి టోకెన్ల జారీ నిలుపుదలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
టీటీడీ ఐదు రోజులుగా సర్వ
దర్శనం టికెట్లు జారీ చేస్తోంది. దీంతో భక్తులు టోకెన్ల కోసం భారీగా
తరలివస్తున్నారు.