తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సునీత రాజీనామా...
By: chandrasekar Wed, 28 Oct 2020 10:02 PM
తెలుగుదేశం పార్టీ
ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు ఆమె తన
రాజీనామా లేఖను పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని
టీడీపీ, చంద్రబాబు, ఆయన
తనయుడు లోకేష్ అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత
అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు చేస్తుందని ఆమె అన్నారు.
టీడీపీ వైఖరి, విధానాలకు
నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుపై నిప్పులు
చెరిగిన సునీత, సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
సంక్షేమం, అభివృద్ధి
లక్ష్యంగా జగన్ కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం
తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.