తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
By: chandrasekar Thu, 29 Oct 2020 1:34 PM
2020-21 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో
ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ప్రకటించింది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30లోపు దరఖాస్తు
చేసుకోవాలని తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్లైన్లో
దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు
http://www.teluguuniversity.ac.in/ లేదా www.teluguuniversity.ac.in/
వెబ్సైట్లు చూడొచ్చు.
పీజీ డిప్లొమా కోర్సులు:
టీవీ జర్నలిజం, జ్యోతిషం
అర్హత: ఏదైనా డిగ్రీ
ఉత్తీర్ణులై ఉండాలి.
డిప్లొమా కోర్సులు: లైట్
మ్యూజిక్, ఫిలిమ్ రైటింగ్, జ్యోతిషం
అర్హత: పదో తరగతి, ఇంటర్
ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిలిమ్ రైటింగ్ కోర్సుకు తెలుగులో రాయడం, చదవడం
వచ్చి ఉండాలి.
సర్టిఫికెట్ కోర్సులు:
జ్యోతిషం, సంగీత
విశారద, మోడ్రన్
తెలుగుఅర్హత: పదో తరగతి
ఉత్తీర్ణులై ఉండాలి.
సంగీత విశారద కోర్సుకు 12 ఏళ్లు నిండిన వారై ఉండాలి.
దరఖాస్తు చేయు విధానం:
ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తులు ప్రారంభం:
అక్టోబర్ 31, 2020
దరఖాస్తులకు చివరితేదీ:
నవంబర్ 30, 2020
వెబ్సైట్: http://www.teluguuniversity.ac.in/ లేదా www.teluguuniversity.ac.in/