వరద బాధితులకు తెలుగు హీరోల సాయం...కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్
By: chandrasekar Wed, 21 Oct 2020 5:47 PM
తెలంగాణం రాష్ట్రాన్ని
భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం
జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇప్పటికీ వర్షం ఆగకుండా కురుస్తుండటంతో ఇళ్లలో
నుంచి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ భారీ వర్షాల వల్ల హైదరాబాద్లో
ప్రాణ, ఆస్తి
నష్టం భారీగానే సంభవించింది. దీని నుండి కోలుకోవడానికి హైదరాబాద్ నగరానికి చాలా
సమయ౦ పడుతుంది. అయితే భారీ వర్షాలు, వరదలు
కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకొనేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.
వరద బాధితుల సహాయార్థం
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మొదటిగా నందమూరి
బాలకృష్ణ రూ.1.5 కోట్ల విరాళాన్ని ప్రకటించగా ఆ తరవాత మంగళవారం
తెలుగు సినిమా హీరోలు వరుసపెట్టి తమ సాయాన్ని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి
కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, నాగార్జున
50
లక్షలు, ఎన్టీఆర్
రూ.50
లక్షలు, రవితేజ
రూ.10
లక్షలు, విజయ్
దేవరకొండ రూ.10 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్-నిర్మాత ఎస్.రాధాకృష్ణ
సంయుక్తంగా రూ. 10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5
లక్షలు, డైరెక్టర్
అనిల్ రావిపూడి రూ.5 లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ రూ.5
లక్షలు వరద బాధితుల సాయంగా ప్రకటించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల
సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేయనున్నట్టు
ప్రకటించారు.