Advertisement

  • రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

By: Sankar Tue, 15 Dec 2020 12:05 PM

రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్


తెలంగాణాలో మరొక ప్రముఖ రాజకీయనాయకుడు కరోనా బారిన పడ్డారు ..ఇప్పటికే చాల మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు...తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్‌కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్వీటర్‌లో పేర్కొన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు

Tags :
|
|

Advertisement