తెలంగాణ పోలీస్ అకాడమీ అటెండర్ కు కరోనా ..
By: Sankar Sun, 21 June 2020 11:45 AM
తెలంగాణాలో కరోనా కలకలం రేపుతూనే ఉంది ..సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులా దాకా పాకిన కరోనా తాజాగా పోలీస్ అకాడమీ లో కూడా నమోదు అయింది ..దీనితో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది..లాక్ డౌన్ సమయం బయట వారిని లోపాలకి అనుమతించకపోవడంతో కరోనా అంతగా కనిపించలేదు ..అయితే తాజాగా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ లో ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అకాడమీ సిబ్బంది, కేడెట్లలో ఆందోళన మొదలైంది.
కాగా, అకాడమీలో ఒకే గదిలో 400 మంది వరకు కేడెట్లను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తూ భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాడమీలో 1,200 మంది ఎస్సైలు, 650 మంది వరకు విమెన్ పీసీ కేడెట్లు శిక్షణ పొందు తున్నారు. వీరు కాకుండా మరో 400 మంది సిబ్బంది బయట నుంచి వస్తారు. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే క్యాంపస్లో ఉంటా రు. లాక్డౌన్ విధించినా అకాడమీలో కొత్తవారిని రానీయలేదు. లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన తరువాత హైదరాబాద్లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో టీఎస్పీఏ అటెండర్ ఉద్యోగికి కరోనా రావడంతో సిబ్బం దిలో కలకలం మొదలైంది
అకాడమీలో ఏ మాత్రం భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదు అని విమర్శలు వస్తున్నాయి..అందరిని దగ్గర దగ్గర కుర్చోపెడ్తూ తరగతులు నిర్వాహిస్తున్నారని , మాస్క్ లు కట్టుకున్న అంత దగ్గరగా ఉండటం వలన ఉపయోగం లేదు అని కేడెట్లలో కరోనా ఆందోళన మొదలైంది..అకాడమీలో శనివారం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి అందరూ హాజరయ్యారు. కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రూ. 2,800 కట్టిన వారికి ప్రైవేటు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలపడంతో సిబ్బంది నీరుగారిపోయారు.