- హోమ్›
- వార్తలు›
- కరోనాను అస్సలు లైట్ తీసుకోవద్దు..హెచ్చరించిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు
కరోనాను అస్సలు లైట్ తీసుకోవద్దు..హెచ్చరించిన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు
By: Sankar Thu, 05 Nov 2020 3:48 PM
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు కరోనా గురించి కొన్ని హెచ్చరికలు చేశారు. కరోనా లేదని భ్రమ పడొద్దన్న ఆయన కరోనాను అస్సలు లైట్ తీసుకోవద్దని కోరారు.
పండుగల సందర్భంగా కరోనా సోకకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా లేదని భ్రమ పడొద్దన్న ఆయన సెకండ్ వేవ్ మాత్రమే కాదు మరిన్ని వేవ్ లు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు.
చలికాలంలో కరోనా తో పాటు ఇతర వైరస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాకిస్ రావటానికి సమయం పడుతుందని అది వచ్చేదాకా తప్పకుండా, మాస్క్, శానిటేజర్ తప్పకుండా వాడాలని కోరారు. జిల్లాల్లో మొబైల్ ల్యాబుల ద్వారా కరోనా టెస్టులు చేస్తున్నామన్న ఆయన త్వరలో గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ కరోనా వార్డులను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.