Advertisement

  • మంత్రులకు కరోనా నింబంధనలు పాటించాలని సూచించిన స్పీకర్ పోచారం

మంత్రులకు కరోనా నింబంధనలు పాటించాలని సూచించిన స్పీకర్ పోచారం

By: Sankar Thu, 10 Sept 2020 6:17 PM

మంత్రులకు కరోనా నింబంధనలు పాటించాలని సూచించిన స్పీకర్ పోచారం


తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలగవ రోజు సభ ప్రారంభం కాగానే.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే సభలో కరోనా వైరస్ కారణంగా నిబంధనలు పాటిస్తూ.. నో సిట్టింగ్ స్టిక్కర్లు అంటించారు. అయితే నో సిట్టింగ్ ఉన్న చోట ఈటెల, జగదీశ్ రెడ్డి పక్క పక్కనే కూర్చొన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఇద్దరూ కూర్చోవడం పట్ల స్పీకర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మంత్రులకు పోచారం చురకలు అంటించారు.

సభా సమయంలో ఈటల పక్క సీట్లో ఉన్న నో-సీటింగ్ చైర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి కూర్చున్నారు. మంత్రులను గమనించిన స్పీకర్.. నో-సీటింగ్ సీట్‌లో కూర్చోవద్దని సూచించారు. స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటల దగ్గర నుంచి జగదీశ్‌రెడ్డి వెళ్లిపోయారు. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మాట్లాడిన పంజాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి కూడా ఇదే విషయాన్ని తెలిపారు. సభ్యులంతా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.

మరోవైపు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎక్కువ సమయం తీసకుంటున్నారని ఈటెల, ఎర్రబెల్లి ఆయన స్పీచ్‌కు అడ్డుపడ్డారు. ఒక్క ప్రశ్నకు నిరంజన్‌రెడ్డి ఎంత సమయం తీసుకుంటారని ఈటెల, ఎర్రబెల్లిలు మంత్రి నిరంజన్ రెడ్డిపై సెటైర్లు వేశారు. దీనిపై స్పందించిన నిరంజన్ రెడ్డి సమాధానం ముఖ్యమా, సమయం ముఖ్యమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిద్దరు స్పీకర్‌కు సమయాన్ని గుర్తుచేశారు. ఇది గమనించిన స్పీకర్‌ పోచారం నిరంజన్‌రెడ్డిను ఉద్దేశించి తొందరగా ముగించాలని కోరారు.


Tags :

Advertisement