Advertisement

  • తెలంగాణాలో వెయ్యి లోపై తాజా కరోనా పాజిటివ్ కేసులు..

తెలంగాణాలో వెయ్యి లోపై తాజా కరోనా పాజిటివ్ కేసులు..

By: Sankar Fri, 13 Nov 2020 09:02 AM

తెలంగాణాలో వెయ్యి లోపై తాజా కరోనా పాజిటివ్ కేసులు..


తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం, కొత్తగా 997 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,55,663కి చేరింది. ఇందులో 2,37,172 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 17,094 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1397కి చేరింది.

తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 48,12,167 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి 8గంటల నుంచి గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 42,163 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement