Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా ..ఒక్కరోజే 945 కేసులు నమోదు

తెలంగాణాలో తగ్గని కరోనా ..ఒక్కరోజే 945 కేసులు నమోదు

By: Sankar Tue, 30 June 2020 9:21 PM

తెలంగాణాలో తగ్గని కరోనా ..ఒక్కరోజే 945 కేసులు నమోదు



తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 945 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8785గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కు చేరింది. ఇక మంగళవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 260కి చేరింది.

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 869 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 29 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 21 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 13 కేసులు నమోదయ్యాయి.ఇక నిర్మల్ జిల్లాలో 4, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 2, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోకేసు గుర్తించారు.

Tags :
|

Advertisement