తెలంగాణాలో మళ్ళీ భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు...
By: Sankar Mon, 02 Nov 2020 10:08 AM
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం...తెలంగాణలో భారీగా కరోనా కేసులు తగ్గిపోయాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 922 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఏడుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరుకోగా... ఇప్పటి వరకు 2,21,992 మంది కరోనాబారినపడి తిరిగి కోలుకున్నారు... 1348 మంది మృత్యువాతపడ్డారు... కరోనా మరణాల రేటు భారత్లో 1.5 శాతంగా ఉంటే... రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది.
రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.12 శాతంగా ఉందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 17,630 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 14,717 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. నిన్న రాష్ట్రంలో 25,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహింంచినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.