Advertisement

  • తెలంగాణాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ...

తెలంగాణాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ...

By: Sankar Tue, 27 Oct 2020 11:09 AM

తెలంగాణాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ...


తెలంగాణ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,554 కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజాగా మరో నలుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,32,671 కి చేరుకోగా.. ఇప్పటి వరకు 2,13,466 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.. ఇక, మృతుల సంఖ్య 1315 కు పెరిగింది..

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.56 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు భారత్‌ వ్యాప్తంగా 90.3 శాతంగా ఉంటే... తెలంగాణలో 91.14 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,890 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 14,851 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

అయితే సోమవారం కరోనా టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గి పోయింది. అందుకే కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 21099 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 41,15,516 కు పెరిగింది.

Tags :
|

Advertisement