తెలంగాణాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా
By: Sankar Sun, 29 Nov 2020 11:09 AM
తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. ఇందులో 2,57,278 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,490 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో కొత్తగా రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1455కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 948 మంది కోలుకున్నారని కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.కాగా గత కొంతకాలంగా తెలంగాణాలో వెయ్యి కంటే తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..
Tags :
reports |
805 |