తెలంగాణాలో కొత్తగా 643 కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Thu, 10 Dec 2020 09:57 AM
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి.తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాతో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 805 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,482కి పెరిగింది.. 2,66,925 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్..
ఇక, నిన్న రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.