Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Tue, 22 Dec 2020 10:20 AM

తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అనుకునేలోపే మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నా మళ్ళీ పెరుగుతున్నాయి.

తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 617 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఇందులో 2,74,260 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,569 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక తెలంగాణలో కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1518 మంది కరోనాతో మృతి చెందినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement