Advertisement

తెలంగాణాలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Sun, 13 Dec 2020 09:13 AM

తెలంగాణాలో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణాలో కరోన పాజిటివ్ కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి...దాదాపుగా చాలాకాలంగా వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు అయితున్నాయి...తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదుకాగా, కరోనాతో నలుగురు మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,724 కాగా, ఇందులో 2,68,601 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 7,630 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా కరోనాతో నలుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1493కి చేరింది.

నిన్న ఒక్కరోజే తెలంగాణలో 609 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 47,186 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు 61,28,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Tags :
|

Advertisement