తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Mon, 16 Nov 2020 09:49 AM
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తుంది. రాష్ట్రంలో ఆదివారం 17,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 502 మంది పాజిటివ్గా నిర్ధారించబడ్డారు.
వైరస్ కారణంగా కొత్తగా ముగ్గురు మరణించారు. కాగా కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,876కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,407 మంది మృతి చెందారు. కాగా కరోనా నుంచి కొత్తగా మరో 1,539 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,42,084గా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 యాక్టివ్లు ఉన్నాయి. ఇల్లు లేదా సంస్థల ఐసోలేషన్లో 11,948 మంది ఉన్నారు. దక్షణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలోనూ కొత్త పాజిటివ్ కేసులు భారీగా తగ్గడంతో అంతా హ్యాపీ ఫీలవుతున్నారు.
Tags :
reports |
502 |