Advertisement

  • తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Thu, 27 Aug 2020 10:29 AM

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కి చేరుకుంది. 8మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 788కు చేరింది. గడిచిన 24 గంటల్లో 872మంది కోలుకున్నారు.

బుధవారం ఒకే రోజు 60,386 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇంకా 1,075 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 11,42,480 పరీక్షలు చేశామని చెప్పింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.68శాతంగా ఉండగా దేశంలో 1.84గా ఉందని, అలాగే రికవరీ రేటు 75.2 శాతంగా ఉందని వివరించింది.

లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు.తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 86095 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27600 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement