Advertisement

తెలంగాణాలో తగ్గని కరోనా ..తాజాగా 12 మంది మృతి

By: Sankar Wed, 16 Sept 2020 09:48 AM

తెలంగాణాలో తగ్గని కరోనా ..తాజాగా 12 మంది మృతి


గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2273 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,62,844కు చేరింది. కొత్తగా 2260 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,31,447 మంది ఇండ్లకు చేరుకున్నారు.

తాజాగా మరో 12 మంది మృతి చెందగా, మొత్తం 996 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 23,569 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.61శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 80.71శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.52శాతం) కంటే ఎక్కువని పేర్కొంది.

నిన్న ఒకే రోజు 55,636 శాంపిల్స్‌ పరీక్షించగా, 883 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 22,76,222 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 325 నిర్ధారణ కాగా, రంగారెడ్డి 185, నల్గొండ 175, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 164, కరీంనగర్‌ 122, వరంగల్‌ 114, సిద్దిపేట 91,

Tags :
|

Advertisement