తెలంగాణాలో తాజాగా ఎన్ని కరోనా కేసులు అంటే !
By: Sankar Thu, 01 Oct 2020 10:59 AM
తెలంగాణ రాష్ట్రంలో మల్లి కరోనా కేసులు పెరిగాయి.. గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 305 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో1,93,600 కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ ఎనిమిది మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 1,135కు చేరింది. ఇవాళ 2,474 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం1,63,407 మంది డిశ్చార్జి అయ్యారు.
మరో 29,058 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 23,702 మంది హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 84.40 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 54,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 30,50,444 పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వివరించింది.