Advertisement

తెలంగాణాలో కరోనా కు తాజాగా పది మంది మృతి..

By: Sankar Tue, 15 Sept 2020 09:24 AM

తెలంగాణాలో కరోనా కు తాజాగా పది మంది మృతి..


తెలంగాణలో సోమవారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. సోమవారం నాడు మొత్తం 2058 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,60,571 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,400గా ఉన్నాయి. మరో 23,534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2,180 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక సోమవారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 984కి చేరింది..

సోమవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 277 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ 143 కొత్త కేసులు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో సోమవారం కరీంనగర్ జిల్లా ఉంది. ఇక్కడ 135 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 51,247 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 2058 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 22 లక్షలు దాటింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 908 మంది ఫలితాలు తేలాల్సి ఉంది.


Tags :
|

Advertisement