తెలంగాణాలో మళ్ళీ రెండు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Tue, 06 Oct 2020 10:25 AM
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి... టెస్ట్ల సంఖ్య తగ్గడంతో నిన్న 1,335 కేసులే నమోదు కాగా.. మళ్లీ రెండువేలకు చేరువయ్యాయి..
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,983 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 2,381 మంది డిశ్చార్జ్ కాగా... 10 మంది మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కు చేరగా.. ఇప్పటి వరకు 1,74,769 మంది రికవరీ అయ్యారు. 1,181 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.6 శాతంగా ఉంటే.. తెలంగాణలో 0.58 శాతంగా ఉంది.. ఇక, రికవరీ రేటు భారత్లో 84.7 శాతంగా ఉంటే.. తెలంగాణలో 86.26 శాతంగా ఉంది. మరోవైపు.. సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 50,598 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.