Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Fri, 14 Aug 2020 10:05 AM

తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..కొత్తగా 1921 పాజిటివ్ కేసులు నమోదు



తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22,046 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1921 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య88,396కు చేరింది. తాజాగా కరోనాతో 9మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 674కు పెరిగింది.

ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 298 కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్‌లో 144, రంగారెడ్డి జిల్లాలో 124, కరీంనగర్‌లో 89, సంగారెడ్డిలో 86, నల్లగొండలో 84, ఖమ్మంలో 73, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 71 చొప్పున, పెద్దపల్లి, సూర్యాపేటలో 64 చొప్పున, జనగామలో 59, జోగుళాంబ గద్వాలలో 56, రాజన్న సిరిసిల్లలో 54, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌లో 53 చొప్పున, జగిత్యాలలో 52, మంచిర్యాలలో 45 నమోదు అయ్యాయి

మహబూబ్‌నగర్‌లో 43, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డిలో 39 చొప్పున, వనపర్తిలో 38, మహబూబాబాద్‌లో 34, ములుగులో 29, ఆదిలాబాద్‌లో 28, వరంగల్‌ రూరల్‌లో 26, నిర్మల్‌లో 24, వికారాబాద్‌లో 19, యాదాద్రి భువనగిరి, మెదక్‌లో 18 చొప్పున, జయశంకర్‌ భూపాలపల్లిలో 17, నారాయణపేటలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 3 కేసులు వెలుగుచూశాయి

Tags :
|
|
|
|

Advertisement