Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి ..ఒక్కరోజే 1676 పాజిటివ్ కేసులు నమోదు..

తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి ..ఒక్కరోజే 1676 పాజిటివ్ కేసులు నమోదు..

By: Sankar Fri, 17 July 2020 10:46 AM

తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి ..ఒక్కరోజే 1676 పాజిటివ్ కేసులు నమోదు..



తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మొత్తం 1676 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,018కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 13,328గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1296 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 27,295 కు చేరింది. ఇక గురువారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 396కి చేరింది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 788 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 224 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 160 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో గురువారం కరీంనగర్ జిల్లా ఉంది. ఇక్కడ 92 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు, తెలంగాణలో గురువారం ఒక్కరోజే 14,027 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,676 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 2,22,693కు చేరింది. గురువారం 12,045 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

Tags :
|
|
|

Advertisement