తెలంగాణాలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !
By: Sankar Thu, 05 Nov 2020 12:46 PM
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం, కొత్తగా 1539 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682కి చేరింది. ఇందులో 2,25,664 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,656 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనాతో 5 మంది మరణించారు.
దీంతో మొత్తం తెలంగాణలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 1362కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో 82, జీహెచ్ఎంసిలో 285, కరీంనగర్ లో 86, ఖమ్మంలో 78, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 102, రంగారెడ్డిలో 123 కేసులు నమోదయ్యాయి.
Tags :
reports |
1539 |