తెలంగాణాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు...
By: Sankar Fri, 30 Oct 2020 09:39 AM
తెలంగాణలో కరోనా కేసులు గత బులెటిన్తో పోలిస్తే మరింత పెరిగాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,531 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 1048 మంది రికవరీ అయ్యారు. ఆరుగురు మృతిచెందారు..
దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,187కు పెరిగింది... ఇప్పటి వరకు 2,17,401 మంది రికవరీ కాగా.. 1330 మంది మృతిచెందారు.. అయితే, తాజాగా బులెటిన్లో రికవరీ కేసుల సంఖ్య మాత్రం భారీగానే తగ్గింది.. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.56 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉందని.. రికవరీ రేటు రాష్ట్రంలో 91.65 శాతంగా ఉంటే.. దేశంలో 91 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,456 యాక్టివ్ కేసులు ఉండగా.. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 293 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ 120, రంగారెడ్డి 114, ఖమ్మంలో 83 కేసులు నమోదు అయ్యాయి.