Advertisement

తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

By: Sankar Tue, 20 Oct 2020 09:58 AM

తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు


తెలంగాణలో టెస్ట్‌లు తగ్గడంతో గత బులెటిన్‌లో అనూహ్యంగా వెయ్యిలోపు మాత్రమే కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,486 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

ఇక, 1,891 మంది రికవరీ కాగా... ఏడుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,545కు పెరగగా.. రికవరీ కేసులు 2,02,577కు చేరాయి. మృతుల సంఖ్య 1,282కు పెరిగింది. ఇక, కరోనా మృతుల శాతం భారత్‌లో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి తగ్గింది. రికవరీ రేటు దేశంలో 88.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 90.21 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 20,686 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 17,208 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,299 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 235 నమోదు అయ్యాయి.

Tags :
|

Advertisement