Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Wed, 28 Oct 2020 1:08 PM

తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1481 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152కి చేరింది.

ఇందులో 2,14,917 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,916 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో తెలంగాణలో కొత్తగా 4 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1319కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెం లో 79, జీహెచ్ఎంసిలో 279, కరీంనగర్ లో 79, ఖమ్మంలో 82, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 138, నల్గొండలో 82, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇండియాలో గడిచిన 24 గంటల్లో 43,893 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. ఇందులో 72,59,509 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,10,803 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 508 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో 1,20,010 మరణించారు

Tags :
|

Advertisement