తెలంగాణాలో తాజాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Sun, 08 Nov 2020 09:13 AM
తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు సంఖ్య మళ్లీ తగ్గింది... గత బులెటిన్ల 1600కు పైగా కేసులు నమోదు కాగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,440 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి...
ఇదే సమయంలో.. 1,481 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరో ఐదుగురు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,50,331కు చేరుకోగా... రికవరీ కేసులు 2,29,064కు పెరిగాయి.. ఇక, ఇప్పటివరకు 1377 మంది కరోనా బారినపడి మృతిచెందారు.. మరోవైపు.. కరోనా మరణాల శాతం దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.55 శాతానికి తగ్గిందని.. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 92.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.50 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్..
ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 19,890 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 17,135 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.. ఇక, గత 24 గంటల్లో 42,673 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 46,18,470కు చేరింది.