Advertisement

  • తెలంగాణాలో స్వల్పంగా తగ్గిన కరోనా ..కొత్తగా 1102 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణాలో స్వల్పంగా తగ్గిన కరోనా ..కొత్తగా 1102 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Sun, 16 Aug 2020 10:36 AM

తెలంగాణాలో స్వల్పంగా తగ్గిన కరోనా ..కొత్తగా 1102 పాజిటివ్ కేసులు నమోదు


దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేధిస్తూనే ఉంది ..రోజుకు అరవై వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయితున్నాయి..తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి ఉంది రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి ..అయితే తాజాగా నమోదు అయినా కేసులను చూస్తే కొంచెం ఊరట అనే చెప్పవచు..

తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులు నమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసులు 91,361కుచేరగా, 693 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 22,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 68,126 మంది బాధితులు కోలుకున్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 234 కేసులు, కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్ మల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున కేసులు ఉన్నాయి. అయితే తెలంగాణలో జరుగుతున్న కరోనా టెస్టుల విషయంలో పలు విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల ఆధార్ కార్డు లేకుంటే కరోనా టెస్టులకు నమూనాలు సేకరించేందుకు వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement