తెలంగాణాలో తాజాగా ఎన్ని కరోనా కేసులు అంటే !
By: Sankar Thu, 12 Nov 2020 5:00 PM
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,015 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,666 కు చేరింది.
24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,393కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,716 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,35,950కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 40,603 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 47,70,004 కు చేరింది..
గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 172 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..ఇక ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి లో 98, మేడ్చల్ మల్కాజ్గిరి లో 97, భద్రాద్రి లో 80, నల్గొండలో 57, ఖమ్మంలో 48, కరీంనగర్లో 46 పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి