Advertisement

  • తెలంగాణాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 06 Aug 2020 09:40 AM

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 2092 కరోనా పాజిటివ్ కేసులు



రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,092 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 586 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73,050కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో 13 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 589కి చేరింది.

ప్రస్తుతం 20,358 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 52,103 మంది వైరస్‌ నుంచి కోలుకు డిశ్చారి అయ్యారు. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేయగా, నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే జిహెచ్ఎంసి లో అత్యధికంగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..ఇక ఆ తర్వాత రంగారెడ్డి లో 169 , వరంగల్ అర్బన్ లో 128 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 126 , కరీంనగర్ లో 123 , సంగారెడ్డి లో 101 , నిజామాబాద్ లో 91 , గద్వాల్లో 72 లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags :
|
|
|

Advertisement