Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు ..మొత్తం 29 జిల్లాల్లో పాజిటివ్ కేసుల గుర్తింపు ..

తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు ..మొత్తం 29 జిల్లాల్లో పాజిటివ్ కేసుల గుర్తింపు ..

By: Sankar Wed, 15 July 2020 10:12 AM

తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు ..మొత్తం 29 జిల్లాల్లో పాజిటివ్ కేసుల గుర్తింపు ..



తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం మొత్తం 1524 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,745కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,531గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1161 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 24840 కు చేరింది. ఇక మంగళవారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 375కి చేరింది.

మరోవైపు, తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 13,175 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1524 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,95,024కు చేరింది. మంగళవారం 11,654 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

మంగళవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 815 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 240 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 97 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా ఉంది. ఇక్కడ 61 కేసులు నమోదయ్యాయి. ఇక నల్గొండ , వరంగల్ అర్బన్ , కరీంనగర్ జిలాల్లో కూడా భారీగానే కేసులు నమోదు అయ్యాయి ..రాష్ట్రంలో మంగళవారం నాడు మొత్తం 29 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|
|

Advertisement