Advertisement

  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ సరికొత్త నిర్ణయం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ సరికొత్త నిర్ణయం

By: chandrasekar Wed, 03 June 2020 2:55 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ సరికొత్త నిర్ణయం


కరోనా కాటేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సరికొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్షల నిర్వహించిన వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలకమైన ధ్రువ పత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.

లాక్‌డౌన్‌ సమయంలో రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంతో.. అభ్యర్థులు ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్‌ ధ్రువ పత్రాల పరిశీలన అమలు చేయనున్నట్లు తెలిపింది.

ఈ ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులకు గతంలోనే రాతపరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు సంబంధించిన మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మెరిట్‌ జాబితాలో చోటు సంపాదించి ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు, వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు సమాచారం.

అలాగే అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధ్రువ పత్రాలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Tags :
|

Advertisement