తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల
By: chandrasekar Wed, 07 Oct 2020 4:37 PM
తెలంగాణలో మరో కీలక
నోటిఫికేషన్కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(TSPSC) గ్రూప్ -2 ఫలితాలను
విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం
సాయంత్రం టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు. 2018లో 1,595
గ్రూప్-4
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
వాటికి సంబంధించిన
ఫలితాలను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల జాబితా
కోసం https://www.tspsc.gov.in/ వెబ్సైట్ను లాగిన్ అవ్వాలి.
ఇదిలాఉంటే ఈ గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది.
ఇదిలాఉంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్
కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 30,723 నియామకాలను చేపట్టినట్లు కార్యదర్శి వాణి ప్రసాద్
పేర్కొన్నారు.