దేశంలో తెలంగాణ పోలీసింగ్ అగ్రభాగాన నిలిచింది ...హరీష్ రావు
By: Sankar Fri, 11 Dec 2020 3:42 PM
అత్యాధునిక, సాంకేతిక సేవలను ఉపయోగించడంలో దేశానికే రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరేండ్లలోనే తెలంగాణ పోలీసింగ్ జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిందని చెప్పారు.
పోలీసుల మెరుగైన సేవల వల్లే హైదరాబాద్తోపాటు పలు స్టేషన్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని మర్కూక్లో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, పోలీస్ వ్యవస్థపై దృష్టిపెట్టారని చెప్పారు. షీటీమ్స్, సీసీ కెమెరాలు, ఆన్లైన్ వ్యవస్థ, సాంకేతిక సేవలతో రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లే అమెజాన్ వంటి సంస్థలొచ్చాయన్నారు. దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు...