Advertisement

  • జ్వాలా గుత్తా అకాడమీ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్

జ్వాలా గుత్తా అకాడమీ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్

By: Sankar Mon, 02 Nov 2020 7:38 PM

జ్వాలా గుత్తా  అకాడమీ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు జ్యోతి ప్రజల్వన చేశారు.

కేటీఆర్ మట్లాడుతూ అకాడమీ స్థాపించిన జ్వల గుత్తా కి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్ లోను స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తెలంగాణలో పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామన్నారు మంత్రి. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అనుకుంటున్నానన్నారు..

జ్వాల అకాడమీ రన్ చేసేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందన్నారు మంత్రి. ఎందరో యంగ్ షట్లర్లకు జ్వాలా ప్రేరణగా నిలుస్తుందన్నారు. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం క్రీడల్లోనూ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవాలని ఆకాక్షించారు.

Tags :
|

Advertisement