Advertisement

  • పోలీస్ శాఖను సీఎం కెసిఆర్ మరింత బలోపేతం చేసారు ..హోమ్ మంత్రి మహమ్మద్ అలీ

పోలీస్ శాఖను సీఎం కెసిఆర్ మరింత బలోపేతం చేసారు ..హోమ్ మంత్రి మహమ్మద్ అలీ

By: Sankar Wed, 07 Oct 2020 8:50 PM

పోలీస్ శాఖను సీఎం కెసిఆర్ మరింత బలోపేతం చేసారు ..హోమ్ మంత్రి మహమ్మద్ అలీ


తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు పోలీసులు వారి కర్తవ్యాన్ని ఎంతో జాగ్రత్తగా విధులు నిర్వహించారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 450 మంది కానిస్టేబుళ్లకు మంత్రి మహమూద్ అలీ అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు. చక్కగా విధులు నిర్వర్తించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Tags :

Advertisement