తెరాసకు షాక్ ..హోంమంత్రి మహమూద్ అలీకు కరోనా పాజిటివ్
By: Sankar Mon, 29 June 2020 11:09 AM
తెలంగాణాలో కరోనా విలయతాండవం చేస్తుంది ..వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరిని కరోనా వణికిస్తోంది ..ముఖ్యంగా అధికార తెరాస పార్టీలో కరోనా కేసులు ఎక్కువ అయ్యాయి ప్రజలకు భయపడకుండా చెప్పాల్సిన ప్రజా ప్రతినిదులే ఇలా కరోనా బారిన పడుతుండటంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రజలు బయపడుతున్నారు ..తాజాగా తెరాస పార్టీలో ముఖ్య నాయకుడు , హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ కరోనా బారిన పడ్డారు ..
ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ కోవిడ్ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు..
అనంతరం ఆస్తమా ఉండటంతో ముదు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు నేడు రాగా, అందులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం ఒక్కరోజే 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.