Advertisement

  • అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ..విచారణకు ఒప్పుకున్న తెలంగాణ హైకోర్ట్

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ..విచారణకు ఒప్పుకున్న తెలంగాణ హైకోర్ట్

By: Sankar Wed, 04 Nov 2020 5:12 PM

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ..విచారణకు ఒప్పుకున్న తెలంగాణ హైకోర్ట్


అగ్రిగోల్డ్ కేసు విచారణకు హైదరాబాద్ హైకోర్టు అంగీకరించింది. విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు మెన్షన్ ను ఆంధ్ర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. సోమవారం నుంచి రెగ్యులర్ గా దీనిపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది . అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని దాఖలు చేసిన అప్లికేషన్ విచారించాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీ రాం కోరారు.

తెలంగాణలో కూడా పెద్ద మొత్తంలో అగ్రిగోల్డ్ సంబంధించి ఆస్తులు ఉన్నాయని, వాటిని వేలం వేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సహకారం తీసుకొని విచారణ ముందుకు వెళ్తామని రాష్ట్ర హైకోర్టు వెల్లడించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, హైకోర్టు ఆధీనంలో ఉన్న నిధులు పంపిణీ చెయ్యాలని కోరుతూ దాఖలు చేసిన అప్లికేషన్ విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు.

Tags :

Advertisement