కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
By: Sankar Sun, 06 Dec 2020 8:35 PM
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పేదల జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఆదివారం హుజూరాబాద్లోని మంత్రి కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 92మంది లబ్ధిదారులకు రూ.38,34,500 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుదన్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags :
gives |