- హోమ్›
- వార్తలు›
- ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులు
ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులు
By: chandrasekar Wed, 11 Nov 2020 09:50 AM
ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో
వీరమరణం పొందిన అమర జవాన్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులు అర్పించారు.
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్లో ఉగ్రవాదులతో జరిగిన
ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన అమర జవాన్లు మహేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డిల
పార్థివదేహాలు మంగళవారం రాత్రి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి.
విమానాశ్రయంలో జవాన్లకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ
కవిత నివాళులర్పించారు.
ఉగ్రవాదులతో జరిగిన
ఎదురుకాల్పుల్లో మరణించిన వీర జవాన్ మహేష్ పార్థివ దేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొమన్పల్లికి తరలించారు. అంబులెన్స్ చుట్టూ
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సైనిక లాంఛనాలతో బుధవారం మహేష్ అంత్యక్రియలు
జరుగనున్నాయి. మరో జవాన్ ప్రవీణ్ కుమార్రెడ్డి పార్థివదేహాన్ని చిత్తూరు జిల్లా
రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.
రేణిగుంట నుండి ప్రవీణ్
స్వస్థలం ఐరాల మండలంలోని రెడ్డివారిపల్లెకు తీసుకెళ్లనున్నారు. ఆయన అంత్యక్రియలు
కూడా బుధవారం జరిగే అవకాశం ఉంది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం
ప్రవీణ్ పార్థీవదేహానికి ఏపీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే నివాళి అర్పించనున్నారు.
తీవ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన కాల్పుల్లో వీరు వీర మరణం పొందారు.