Advertisement

  • నూతన రెవిన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళసై

నూతన రెవిన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళసై

By: Sankar Tue, 22 Sept 2020 4:05 PM

నూతన రెవిన్యూ చట్టానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళసై


తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ బిల్లు చట్టం అమల్లోకి వచ్చింది. మిగతా బిల్లులతో పాటు ఈ బిల్లు కూడా చట్టం రూపం దాల్చాయి. తెలంగాణలో కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూమి హక్కులు- పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టంతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి.

ఈమేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 19న గెజిట్‌ నోటిఫికేషన్లు ప్రచురించారు. అందుకు అనుగుణంగా న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ బీపాస్‌ చట్టంతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, పురపాలక, పంచాయతీరాజ్‌, జీఎస్టీ సవరణ చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అమలు నిబంధనలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో భూ హక్కులు - పాసు పుస్తకాలు, వీఆర్‌వోల రద్దు, టీఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్‌, ప్రైవేటు వర్సిటీలు, తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య పరిస్థితి బిల్లు, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు, తెలంగాణ ఫిస్కల్‌ రెస్సాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు, తెలంగాణ సివిల్‌ న్యాయస్థానాల సవరణ బిల్లుతో పాటు జీఎస్టీ సవరణ చట్టాల అమలుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది

Tags :

Advertisement